భద్రాచలంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం
ABN, First Publish Date - 2022-04-10T20:14:37+05:30
శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు మంత్రి ఇంద్రకరణ్రెడ్డి సమర్పించారు.
భద్రాచలం : శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు మంత్రి ఇంద్రకరణ్రెడ్డి సమర్పించారు. ముత్యాల తలంబ్రాలను మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్ సమర్పించారు. అలాగే టీటీడీ చైర్మన్ సీతారాముల వారికి పట్టువస్త్రాలు సమర్పించారు.ఈ ఏడాది శ్రీసీతారాముల కల్యాణానికి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామి కల్యాణాన్ని వీక్షించేందుకు రెండేళ్ల తర్వాత భక్తులకు అనుమతి ఇచ్చారు. దీంతో భద్రాద్రి భక్త జనసందోహంగా మారింది. కరోనా వల్ల గత రెండేళ్లు భక్తులను అధికారులు అనుమతించలేదు.
Updated Date - 2022-04-10T20:14:37+05:30 IST