Basaraకు బండి.. బిక్కనూర్ టోల్ప్లాజా వద్ద టెన్షన్ టెన్షన్
ABN, First Publish Date - 2022-06-17T16:28:25+05:30
జిల్లాలోని బిక్కనూర్ టోల్ప్లాజా వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది.
కామారెడ్డి: జిల్లాలోని బిక్కనూర్ టోల్ప్లాజా వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆందోళన చేస్తున్న ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బాసరకు బయలుదేరారు. బండి సంజయ్ రాకతో పోలీసు శాఖ అలర్ట్ అయ్యింది. టోల్ప్లాజా వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి స్వాగతం పలికేందుకు టోల్ప్లాజా వద్దకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. బండి సంజయ్ను అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో టోల్ప్లాజా వద్ద టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది.
Updated Date - 2022-06-17T16:28:25+05:30 IST