Delhi tour : ఢిల్లీకి బండి సంజయ్
ABN, First Publish Date - 2022-08-06T14:21:15+05:30
TS News: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ (BJP President Bandi Sanjay) కాసేపట్లో ఢిల్లీ (Delhi)కి బయల్దేరనున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఆయన
TS News: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ (BJP President Bandi Sanjay) కాసేపట్లో ఢిల్లీ (Delhi)కి బయల్దేరనున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఆయన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. దీంతో బండి సంజయ్ తన పాదయాత్రకు శనివారం తాత్కాలిక విరామం ప్రకటించారు. ఢిల్లీలో ఆయన బీజేపీ (BJP) అగ్రనేతలు జేపీ నడ్డా, అమిత్ షాను కలిసే అవకాశం ఉంది. ఈనెల 21న మునుగోడులో సభ, పాదయాత్ర ముగింపు సభలకు అమిత్ షా, జేపీ నడ్డాను అహ్వానించనున్నట్లు తెలిసింది. మునుగోడు ఉప ఎన్నిక, తెలంగాణలో రాజకీయ పరిస్థితులను జాతీయ నేతలకు వివరించనున్నారు.
Updated Date - 2022-08-06T14:21:15+05:30 IST