సీఎం కేసీఆర్కు బండి సంజయ్ బహిరంగ లేఖ
ABN, First Publish Date - 2022-04-16T20:27:14+05:30
రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనలో ఏ సాగునీటి ప్రాజెక్టూ పూర్తికాలేదని బిజెపి రాష్ట్ర ప్రెసిడెంట్ బండిసంజయ్ ఆరోపించారు.
మహబూబ్ నగర్: రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనలో ఏ సాగునీటి ప్రాజెక్టూ పూర్తికాలేదని బిజెపి రాష్ట్ర ప్రెసిడెంట్ బండిసంజయ్ ఆరోపించారు. రాయల సీమ ఎత్తిపోతలను ఆపడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలమయ్యారని ఆయన అన్నారు. పాలమూరు ప్రాజెక్టులపై చర్చించేందుకు పాలమూరుకు రావాలని కోరుతూ బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. క`ష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి సరైన వాటా దక్కలేదని అన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపడంలో పూర్తిగా విఫలమయ్యారని లేఖలో పేర్కొన్నారు. పాలమూరు ప్రాజెక్టులపై చర్చించడానికి టీఆర్ఎస్ సిద్ధమా? అంటూ ప్రశ్నించారు.
Updated Date - 2022-04-16T20:27:14+05:30 IST