బండి సంజయ్ ఎవరి మెడలు వంచారు?: మంత్రి గంగుల
ABN, First Publish Date - 2022-04-14T00:19:07+05:30
బీజేపీ నేత బండి సంజయ్ ఎవరి మెడలు వంచారు? అని మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో
హైదరాబాద్: బీజేపీ నేత బండి సంజయ్ ఎవరి మెడలు వంచారు? అని మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతు బంధు, రైతు బీమా, 24 గంటల విద్యుత్ ఇవ్వమని, ప్రధాని మోదీ మెడలు ఎందుకు వచ్చడం లేదు అని నిలదీశారు. కేంద్రం మెడలు వంచి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించని సవాల్ విసిరారు. బియ్యం తీసుకెళ్లి డబ్బులు ఇవ్వమని కేంద్రానికి 16 లేఖలు ఇచ్చామని తెలిపారు. వరి వేసే ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం లేదని గంగుల కమలాకర్ తెలిపారు.
Updated Date - 2022-04-14T00:19:07+05:30 IST