విద్యార్థులవి సిల్లీ సమస్యలన్న సబిత Sorry చెప్పాలి: Bandi Sanjay
ABN, First Publish Date - 2022-06-20T18:08:30+05:30
సీఎం కేసీఆర్(CM KCR)కు టీబీజేపీ చీఫ్ బండి సంజయ్(Bandi Sanjay) లేఖ రాశారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల(IT Students) సమస్యలు పరిష్కరించాలని..
హైదరాబాద్ : సీఎం కేసీఆర్(CM KCR)కు టీబీజేపీ చీఫ్ బండి సంజయ్(Bandi Sanjay) లేఖ రాశారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల(IT Students) సమస్యలు పరిష్కరించాలని లేఖలో ఆయన పేర్కొన్నారు. విద్యార్థులవి సిల్లీ సమస్యలన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy) క్షమాపణలు చెప్పాలనిన డిమాండ్ చేశారు. విద్యార్థుల 12 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలన్నారు. ‘6 రోజులుగా విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నా.. సీఎం కేసీఆర్కు పట్టదా?.. జాతీయ పార్టీ ఏర్పాటుకు మాత్రం సీఎంకు సమయం ఉంటుందా?’ అని బండి సంజయ్ ప్రశ్నించారు.
Updated Date - 2022-06-20T18:08:30+05:30 IST