ప్రజా ప్రతినిధులపై దాడులకు ఎలా అనుమతి ఇస్తున్నారు?: బండి సంజయ్
ABN, First Publish Date - 2022-01-27T17:44:30+05:30
కార్యకర్తలను పరామర్శించటానికి పోలీసుల అనుమతి అవసరం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు.
హైదరాబాద్ : కార్యకర్తలను పరామర్శించటానికి పోలీసుల అనుమతి అవసరం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులపై దాడులకు పోలీసులు ఎలా అనుమతి ఇస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తల్లో భరోసా నింపేందుకే నిజామాబాద్ వెళ్తున్నామన్నారు. టీఆర్ఎస్ కుట్రలో భాగంగానే ఎంపీ అర్వింద్పై దాడి జరిగిందన్నారు. దాడితో తమకు సంబంధం లేదని రైతుల సమన్వయ సమితి ప్రకటించిందని బండి సంజయ్ పేర్కొన్నారు.
Updated Date - 2022-01-27T17:44:30+05:30 IST