ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్ఎస్‌కి రాజీనామా.. కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు ప్రకటించిన బడంగ్‌పేట్ మేయర్

ABN, First Publish Date - 2022-07-03T17:08:45+05:30

ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ(TRS Party)కి రాజీనామా చేస్తున్నట్లు బడంగ్ పేట్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad : ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ(TRS Party)కి రాజీనామా చేస్తున్నట్లు బడంగ్ పేట్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి(Manchireddy Kishan Reddy)కి ఈరోజు రాజీనామా లేఖను పంపడం జరిగిందని, పార్టీకి, క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆమె లేఖలో పేర్కొన్నారు. బడంగ్ పేట అభివృద్ధిని కాంక్షించి పార్టీలో చేరడం జరిగిందని, అప్పటి నుంచి నేటి వరకూ పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమం విజయవంతం చేయడం కోసం కృషి చేశామని, క్రమశిక్షణతో పార్టీ పట్ల అంకితభావంతోనే తాము సేవలందించామన్నారు. కానీ గడిచిన కొంతకాలంగా మా పట్ల వ్యతిరేక భావనతో ఉండడంతోనే, తాము ఆత్మగౌరవాన్ని చంపుకోలేక టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని తెలిపారు. పార్టీలో సహకరించిన పార్టీ పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గంలోని నాయకులందరితో కలిసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం కోసం కృషి చేస్తామని పారిజాతారెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2022-07-03T17:08:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising