ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్నలే ఆ చెల్లెళ్ల పాలిట కీచకులు

ABN, First Publish Date - 2022-05-20T08:38:16+05:30

అన్నలే ఆ బాలికల పాలిట కీచకులు అయ్యారు. వావివరసలు మరిచిన ఆ అన్నలు తమ తోబుట్టువులపై అత్యాచారం చేసి వారిని గర్భవతులను చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • సొంతచెల్లిపై ఒకడు.. చిన్నాన్న బిడ్డపై మరొకడు
  • అత్యాచారం చేసి గర్భవతులను చేసిన వైనం
  • బాచుపల్లి, ములుగు జిల్లాల్లో ఘటనలు 


నిజాంపేట్‌, కన్నాయిగూడెం, మే19(ఆంధ్రజ్యోతి): అన్నలే ఆ బాలికల పాలిట కీచకులు అయ్యారు. వావివరసలు మరిచిన ఆ అన్నలు తమ తోబుట్టువులపై అత్యాచారం చేసి  వారిని గర్భవతులను చేశారు. ఓ బాలికను తోడబుట్టిన అన్న చెరచగా.. మరో బాలికను పెద్దనాన్న కొడుకు బెదిరించి లొంగదీసుకున్నాడు. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ రెండు ఘటనలు గురువారం వెలుగులోకి రాగా.. బాఽధిత బాలికలిద్దరూ 13 ఏళ్ల వయసు వారే. సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటనలకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మేడ్చల్‌ జిల్లా బాచుపల్లికి చెందిన దంపతులకు ఓ కొడుకు(17), కూతురు (13) ఉన్నారు. ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో చెల్లెలపై ఆమె అన్న గత రెండేళ్లగా పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే, ఇటీవల ఆ బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం బయటపడింది. సొంత అన్నే ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుసుకున్న తల్లి.. తన కూతురు గర్భం తీసివేయాలని వైద్యులను ఆశ్రయించింది. అందుకు నిరాకరించిన వైద్యులు నాంపల్లి భరోసా సెంటర్‌కు వెళ్లాలని సూచించారు. 


వారు ఆ బాలికను జిల్లా బాలిక రక్షణశాలకు చేర్చగా  అక్కడి అధికారులు బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితునిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక, ములుగు జిల్లాలో జరిగిన ఘటనలో ఓ బాలిక(13)ను ఆమె సొంత పెదనాన్న కొడుకు బెదిరించి 6 నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. కుటుంబ సభ్యులను చంపుతానని, ఇంటికి నిప్పు పెడతానని బెదిరించి బాధితురాలిని లొంగదీసుకున్నాడు. మూడురోజుల క్రితం కడుపునొప్పి రావడంతో బాలికను తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా గర్భం దాల్చినట్లు నిర్ధారణ అయింది. ఈవిషయంపై బాలికను ప్రశ్నించగా.. తనపై జరుగుతున్న అఘాయిత్యం గురించి చెప్పింది. దీంతో బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించగా.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2022-05-20T08:38:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising