ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దాడిపై MP Arvindకు Amit Shah ఫోన్

ABN, First Publish Date - 2022-07-15T22:19:25+05:30

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. శుక్రవారం ఎర్దండిలో ఎంపీ అర్వింద్ పర్యటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్:  నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌(MP Dharmapuri Arvind)కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) ఫోన్ చేశారు.  శుక్రవారం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి సమీపంలో ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిని పరిశీలించేందుకు వచ్చారు.  ఈ సమయంలో కొంతమంది ‘అర్వింద్‌ గో బ్యాక్’ అని నినాదాలు చేస్తూ  ఆయన ఉన్న కారు అద్దాలను పగులగొట్టి అర్వింద్‌పై దాడికి దిగారు.  ఈ దాడిపై కేంద్ర హోంమంత్రి  ఆరా తీశారు.

ఈ దాడిపై అర్వింద్ మాట్లాడుతూ.. ‘‘ప్లాన్ ప్రకారమే తనపై దాడి జరిగింది, కార్యకర్తలపైనా దాడులు జరుగుతున్నాయి. బీజేపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా అధికార టీఆర్ఎస్ దాడులు చేస్తోంది. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎక్కడ తిరిగిన దాడులు జరపాలని టీఆర్ఎస్ నాయకత్వం ఎమ్మెల్యేలకు ఆదేశాలిచ్చింది.  దాడి వెనక టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగరరావు ఉన్నారు’’ అని ఎంపీ అర్వింద్ అమిత్ షా‌కు ఫోన్లో తెలిపారు.

Updated Date - 2022-07-15T22:19:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising