అమర్నాథ్ యాత్రలో చిక్కుకుపోయిన జనగామ వాసులు
ABN, First Publish Date - 2022-07-09T15:43:24+05:30
అమర్నాథ్ యాత్రలో నలుగురు జిల్లా వాసులు చిక్కుకుపోయారు.
జనగామ: అమర్నాథ్ యాత్రలో నలుగురు జిల్లా వాసులు చిక్కుకుపోయారు. ఈ నెల 3న తాడురి రమేష్, సిద్దలక్ష్మి, లక్ష్మి నర్సయ్య, సత్యనారాయణ యాత్రకు వెళ్లారు. కాగా నిన్న అమర్నాథ్ యాత్రలో వరద పోటెత్తిన అనేక మంది కొట్టుకుపోయారు. ఈ విషయం తెలిసిన కుటుంబసభ్యులు భయాందోళనకు గురయ్యారు. అయితే తాడురి రమేష్, సత్యనారాయణ తాము సురక్షితంగా ఉన్నామని సమాచారం ఇచ్చారు. మరో ఇద్దరి ఆచూకీ ఇంత వరకు లభ్యం కాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.
కాగా... నిన్న అమర్నాథ్ యాత్రలో వరద బీభత్సం సృష్టించింది. ఎగువ నుంచి వరద పోటెత్తడంతో దాదాపు 15 మంది భక్తులు దుర్మరణం చెందారు. 40 మంది కొట్టుకుపోయిన విషయం తెలిసిందే.
Updated Date - 2022-07-09T15:43:24+05:30 IST