Rajagoapal reddy కరుడుగట్టిన కాంగ్రెస్ వాది: వంశీ చంద్ రెడ్డి
ABN, First Publish Date - 2022-07-30T17:52:34+05:30
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డిని పార్టీ సీనియర్ నేతలు బుజ్జగించే పనిలో పడ్డారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ(Congress party)కి రాజీనామా చేసే యోచనలో ఉన్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి (Rajagopal reddy)ని పార్టీ సీనియర్ నేతలు బుజ్జగించే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం రాజగోపాల్తో ఏఐసీసీ సెక్రటరీ వంశీచంద్ రెడ్డి (Vamshi chand reddy) చర్చలు జరిపారు. అనంతరం వంశీ చంద్ మీడియాతో మాట్లాడుతూ... రాజగోపాల్ రెడ్డి కరుడుగట్టిన కాంగ్రెస్ వాది అని చెప్పుకొచ్చారు. రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడరని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయరని స్పష్టం చేశారు. ఉప ఎన్నిక వచ్చే అవకాశం లేదన్నారు. తాను రాజగోపాల్ రెడ్డిని తరుచూ కలుస్తుంటానని తెలిపారు. టీఆర్ఎస్ (TRS)తో పోట్లాడేది కాంగ్రెస్ మాత్రమే అని అన్నారు. బీజేపీ నేత బండి సంజయ్ (Bandi sanjay) మాటలు ఉత్తయే అంటూ కొట్టిపారేశారు. హైదరాబాద్ వరదలు వచ్చినప్పుడు బండి సంజయ్ చేసిన వాఖ్యలే నిదర్శనమని వంశీ చంద్ రెడ్డి పేర్కొన్నారు.
Updated Date - 2022-07-30T17:52:34+05:30 IST