ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాణ్యమైన విత్తనాలతోనే వ్యవసాయాభివృద్ధి

ABN, First Publish Date - 2022-09-10T09:09:01+05:30

ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక లాంటిదని, నాణ్యమైన విత్తనాలతోనే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రి నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్‌, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక లాంటిదని, నాణ్యమైన విత్తనాలతోనే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో జాతీయ విత్తన సంఘం ఆధ్వర్యంలో ‘బయో టెక్నాలజీతో పంటల అభివృద్థి’ అనే అంశంపై శుక్రవారం జరిగిన సదస్సులో జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా మంత్రి మాట్లాడారు. ప్రపంచ విత్తన పరిశ్రమలో భారతదేశం ఐదో స్థానంలో ఉన్నదన్నారు. ప్రభుత్వ తోడ్పాటుతో ప్రైవేటు రంగంలో విత్తన పరిశ్రమ వృద్థి చెందిందని అన్నారు. ప్రజల ఆహార అవసరాల దృష్ట్యా మరింత వృద్ధిచెందాల్సిన అవసరం ఉన్నదన్నారు.  దేశంలో పత్తి విత్తనాల్లో 50శాతం తెలంగాణ నుంచే ఉత్పత్తి అవుతున్నాయన్నారు. ఈ సదస్సులో జాతీయ విత్తన సంఘం అధ్యక్షులు, నూజీవీడు సీడ్స్‌ అధినేత ప్రభాకరరావు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-10T09:09:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising