ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోడు భూముల సమస్యలను పరిష్కరించాలి

ABN, First Publish Date - 2022-12-09T22:57:49+05:30

పోడు భూముల సమస్యలను ప్రభుత్వం పరి ష్కరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్‌, జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్‌లు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మందమర్రిటౌన్‌, డిసెంబరు 9: పోడు భూముల సమస్యలను ప్రభుత్వం పరి ష్కరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్‌, జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్‌లు తెలిపారు. శుక్రవారం సీపీఐ పార్టీ కార్యాలయంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పోడు భూ ముల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి విస్మరించిందన్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు, పోడు భూముల సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 21న తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట, 29న కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపడుతు న్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ సభల్లో బొగ్గు గనులను ప్రైవేటుపరం చేయనని చెబుతూనే నాలుగు బ్లాకులను వేలం పాటకు ఎలా పెడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులు భీమనాధుని సుదర్శన్‌, రేగుంట చంద్రశేఖర్‌, మేకల దాసు, నగేష్‌, లింగయ్య, మల్లయ్య, కలీందర్‌ఖాన్‌, రవి, సమ్మయ్య, పాల్గొన్నారు.

Updated Date - 2022-12-09T22:57:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising