విజయ సంకల్ప సభను విజయవంతం చేయాలి
ABN, First Publish Date - 2022-07-01T04:07:45+05:30
హైదరాబాద్లో జూలై 3న ప్రధానిమోదీ ఆధ్వర్యంలో చేపట్టే విజయసంకల్ప సభను జయప్రదం చేయాలని దాద్రానగర్ హవేలి రాష్ట్ర అధ్యక్షుడు దిపేష్ టెండల అన్నారు.
-దాద్రానగర్ హవేలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిపేష్ టెండల
రెబ్బెన, జూన్ 30: హైదరాబాద్లో జూలై 3న ప్రధానిమోదీ ఆధ్వర్యంలో చేపట్టే విజయసంకల్ప సభను జయప్రదం చేయాలని దాద్రానగర్ హవేలి రాష్ట్ర అధ్యక్షుడు దిపేష్ టెండల అన్నారు. గురువారం గోలేటి టౌన్షిప్లో ఏర్పాటుచేసిన సన్నాహాక సమా వేశంలో ఆయన మాట్లాడారు. అన్ని మండలాల నుంచి కీలక నాయకులు, కార్యకర్తలు విధిగా హాజరు కావాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ సమావేశానికి పీఎం మోదీ, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంశాఖ మంత్రి అమిత్షా హాజరు కానున్నట్టు తెలిపారు. ఈ సమావేశానికి అంతా హాజరు కావాలన్నారు.
బీజేపీ మణిపూర్ రాష్ట్ర అధ్యక్షురాలికి ఘనస్వాగతం
కాగజ్నగర్: మణిపూర్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు శారదదేవి గురువారం కాగజ్నగర్కు వచ్చారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్, బీజేపీ నాయకుడు డాక్టర్ హరీష్ బాబు, రాజమౌలి, కొంగసత్యనారాయణ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం శాలువాతో సన్మానం చేశారు. కాగా శుక్రవారం కాగజ్నగర్లోని పటేల్ గార్డెన్స్లో నిర్వహించే సన్నాహకసభలో ప్రత్యేకఅతిథిగా పాల్గొని మాట్లాడనున్నారు.
Updated Date - 2022-07-01T04:07:45+05:30 IST