రైల్వే వంతెన నిర్మించాలి
ABN, First Publish Date - 2022-01-20T03:58:08+05:30
మంచిర్యాల పట్టణంలోని హైటెక్సిట్-రాజీవ్నగర్ మధ్య రైల్వే ట్రాక్పై వంతెన నిర్మించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ డిమాం డ్ చేశారు. బుధవారం మంచిర్యాల మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందించారు.
ఏసీసీ, జనవరి 19: మంచిర్యాల పట్టణంలోని హైటెక్సిట్-రాజీవ్నగర్ మధ్య రైల్వే ట్రాక్పై వంతెన నిర్మించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ డిమాం డ్ చేశారు. బుధవారం మంచిర్యాల మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందించారు. పట్టణంలోని లక్ష్మీటాకీస్ చౌరస్తా నుంచి చున్నంబట్టివాడ వరకు వంద ఫీట్ల రోడ్డు, రాజీవ్ నగర్ రైల్వే వంతెనను నిర్మిస్తామని ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నా రని రూ.77 కోట్లతో రైల్వే వంతెనను ప్రారంభించాలని కోరారు. కార్యక్రమంలో వెంకటేశ్వర్రావు, పురుషోత్తం, జైన్, శ్రీదేవి, లలిత తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-01-20T03:58:08+05:30 IST