వ్యవసాయ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ABN, First Publish Date - 2022-01-25T03:48:03+05:30
వ్యవసాయ కార్మిక సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, బీకేఎంయూ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుండ చంద్రమాణిక్యం, సహాయ కార్యదర్శి బొంతల లక్ష్మీ నారాయణలు మాట్లాడుతూ అర్హత కలిగిన వ్యవసాయ కార్మికులకు ఇండ్ల స్థలాలు, డబుల్బెడ్రూం ఇవ్వాలని, ఉపాధిహామీలో 200 రోజుల పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
బెల్లంపల్లి, జనవరి 24: వ్యవసాయ కార్మిక సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, బీకేఎంయూ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుండ చంద్రమాణిక్యం, సహాయ కార్యదర్శి బొంతల లక్ష్మీ నారాయణలు మాట్లాడుతూ అర్హత కలిగిన వ్యవసాయ కార్మికులకు ఇండ్ల స్థలాలు, డబుల్బెడ్రూం ఇవ్వాలని, ఉపాధిహామీలో 200 రోజుల పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. 55 సంవత్సరాలు నిండిన వ్యవసాయ కార్మికు నికి రూ.5 వేల పింఛన్ అందించాలని, పోడు భూములు సాగు చేసుకునే వారి కి పట్టాదారు పాసు పుస్తకాలు అందించాలని, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీవోకు వినతిపత్రం అందించారు. అక్కెపల్లి బాపు, దేవావరం, శంకర్గౌడ్ పాల్గొన్నారు.
Updated Date - 2022-01-25T03:48:03+05:30 IST