దేశానికే స్ఫూర్తి.. నాగోబా ఆలయ నిర్మాణం
ABN, First Publish Date - 2022-12-16T01:13:00+05:30
మెస్రం వంశస్తులు స్వంత డబ్బులతో రాతి శిల్పాలతో ఆలయ నిర్మాణం చేయడం దేశానికి స్ఫూర్తిదాయంగా ఉంద ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గన్నవరం భవనేశ్వర ఆలయ పీఠాధిపతి స్వామి కమలానంద భారతి అన్నారు. గురువారం ఆదివాసీ మెస్రం వం శస్తులు రూ. 5 కోట్లతో నిర్మించిన ఆలయానికి గురువారం చేరుకున్నా రు.
ఇంద్రవెల్లి, డిసెంబరు 15: మెస్రం వంశస్తులు స్వంత డబ్బులతో రాతి శిల్పాలతో ఆలయ నిర్మాణం చేయడం దేశానికి స్ఫూర్తిదాయంగా ఉంద ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గన్నవరం భవనేశ్వర ఆలయ పీఠాధిపతి స్వామి కమలానంద భారతి అన్నారు. గురువారం ఆదివాసీ మెస్రం వం శస్తులు రూ. 5 కోట్లతో నిర్మించిన ఆలయానికి గురువారం చేరుకున్నా రు. ఈసందర్భంగా ఆయన నాగోబాకు పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. నాగోబా ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్ఠాపన చేస్తున్న విషయం తెలుసుకొని వచ్చానన్నారు. సమ్మక్క, సారల్మలకు ఉ న్న ప్రాధాన్యత నాగోబాకు ఉందని, రాబోయే రోజులలో పుణ్యక్షేత్రంగా ల క్షలాది భక్తుల కోరికలు తీర్చుతుందని అన్నారు. ఆలయ పీఠాధిపతి మె స్రం వెంకట్రావు, మెస్రం చిన్నుపటేల్, పూజారి మెస్రం మెస్రం కోసు, ప్రధాన్ మెస్రం దేవ్రావు, మెస్రం జంగు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-16T01:13:01+05:30 IST