ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రణాళికాబద్ధంగా చదివితే లక్ష్యం చేరుకోవచ్చు

ABN, First Publish Date - 2022-05-22T04:31:04+05:30

ప్రణాళికాబద్ధంగా చదివితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. శనివారం తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో గురుకుల విద్యార్థులకు ఐఐటీ, నీట్‌, ఎంసెట్‌ ఉచిత కోచింగ్‌ క్యాంపును ప్రారంభించారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెల్లంపల్లి, మే 21 : ప్రణాళికాబద్ధంగా చదివితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. శనివారం తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో గురుకుల విద్యార్థులకు ఐఐటీ, నీట్‌, ఎంసెట్‌ ఉచిత కోచింగ్‌ క్యాంపును ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు ఉన్నతమైన విద్యావకాశాలు కల్పించడానికి గురుకులాలను ఏర్పాటు చేసిందన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. అనంతరం ఐఐటీ, నీట్‌ ప్రవేశాలకు సంబంధించిన పుస్తక ప్రదర్శనను తిలకించారు. ప్రిన్సిపాల్‌ ఐనాల సైదులు, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ సుదర్శన్‌, కౌన్సిలర్‌లు, రాములునాయక్‌, గోసిక రమేష్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ రాజ్‌కుమార్‌, అద్యాపకులు శ్రీరామవర్మ, అవోక్‌, రాజేష్‌, రవీందర్‌, వామన్‌, రవి, సాగర్‌, విద్యార్థులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-05-22T04:31:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising