అనుమానాస్పదంగా వివాహిత మృతి
ABN, First Publish Date - 2022-03-02T06:51:43+05:30
అనుమానాస్పదంగా వివాహిత మృతి
మృతురాలి బంధువుల ఆందోళన
హత్యానేరం కింద కేసు నమోదు
నిర్మల్ చైన్గేట్, మార్చి 1 : స్థానిక మంజులాపూర్లో అరుగు ల ప్రణీత(25) అనే వివాహిత తన ఇంట్లో ఉరి వేసుకొని మర ణించిన సంఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. కుంటాలకు చెందిన ప్రణీతకు గత ఏడేళ్ల క్రితం మంజులాపూర్కు చెందిన సాయికృష్ణతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కాగా ప్రణీత మరణానికి భర్త సాయికృష్ణ, అత్త పుష్పల వేధింపులే కారణం అంటూ ఆమె బంధు వులు మంగళవారం మంజులాపూర్ గ్రామంలో ఆం దోళనకు దిగారు. మృతురాలు ప్రణీత బంధువులు రాస్తారోకో చేపట్టి వెంటనే భర్త, అత్తలపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం తెలుసుకున్న రూరల్ ఎస్సై అక్కడికి చేరుకుని ప్రణీత కుటుంబసభ్యులతో మాట్లాడి వారిని శాంతింపజేశారు. కాగా భర్త సాయి కృష్ణ, అత్తపుష్పలపై హత్యానేరం కింద కేసు నమో దు చేసినట్లు ఎస్సై తెలిపారు. దీంతో మృతురాలి బంధువులు ఆందోళన విరమించారు.
Updated Date - 2022-03-02T06:51:43+05:30 IST