నేడు రాష్ట్రస్థాయి వైద్యుల సదస్సు
ABN, First Publish Date - 2022-05-15T05:34:36+05:30
జిల్లా కేంద్రంలో తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్హోమ్స్, ఐఎంఏ సభ్యుల ఆరవ రాష్ట్రస్థాయి సదస్సు ఆదివారం జరుగు తుందని ప్రైవేటు హాస్పిటల్స్, నర్సింగ్హోమ్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రమణ, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు ఎన్.మల్లేష్లు పేర్కొన్నారు
మంచిర్యాల కలెక్టరేట్, మే 14: జిల్లా కేంద్రంలో తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్హోమ్స్, ఐఎంఏ సభ్యుల ఆరవ రాష్ట్రస్థాయి సదస్సు ఆదివారం జరుగు తుందని ప్రైవేటు హాస్పిటల్స్, నర్సింగ్హోమ్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రమణ, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు ఎన్.మల్లేష్లు పేర్కొన్నారు. శనివారం ఐఎంఏ భవనంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైద్య వృత్తిపై సమాజంలో ప్రత్యేకమైన గౌరవం ఉందని, దాంతో పాటు హక్కులను, స్వేచ్ఛను కాపాడు కోవాలన్నారు. ప్రైవేటు ఆసుపత్రులు, వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలను పరి ష్కరించడమే అసోసియేషన్ లక్ష్యమని, ఆసుపత్రి ఏర్పాటుకు ప్రభుత్వ నిబం ధనలు, రిజిస్ర్టేషన్ విధానం, చట్టబద్దతపై అవగాహన కల్పించేందుకే సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. సదస్సుకు రాష్ట్ర ఆరోగ్య, దేవాదాయ శాఖ మంత్రులు, ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు, ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు, 33 జిల్లాలకు చెందిన ఐఎంఏ, తాన అసోసియేషన్ సభ్యులు పాల్గొంటారని తెలిపారు. వైద్యులు ఎస్.వెంకటేశ్వర్లు, సుమన్కుమార్, రవిప్రసాద్, కుమారస్వామి, రఘునందన్, అన్నపూర్ణ, తొగరి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-05-15T05:34:36+05:30 IST