కమ్యూనిటీ పోలీసింగ్తో ప్రజలకు చేరువ
ABN, First Publish Date - 2022-07-04T03:50:16+05:30
కమ్యూనిటీ పోలీసింగ్తో ప్రజలు పోలీసులకు స్నేహపూరిత వాతావరణం నెల కొంటుందని డీఎస్పీ కరుణాకర్ అన్నారు. ఆదివారం మండలంలోని మారుమూల గ్రామమైన సోమినిలో నిరుపేదలకు నిత్యావసర సామగ్రిని పంపిణీ చేశారు.
- డీఎస్పీ కరుణాకర్
బెజ్జూరు, జూలై 3: కమ్యూనిటీ పోలీసింగ్తో ప్రజలు పోలీసులకు స్నేహపూరిత వాతావరణం నెల కొంటుందని డీఎస్పీ కరుణాకర్ అన్నారు. ఆదివారం మండలంలోని మారుమూల గ్రామమైన సోమినిలో నిరుపేదలకు నిత్యావసర సామగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీసులు ప్రజల కోసమే పనిచేస్తున్నారని, ఏకష్టంవచ్చినా ఆదుకునేం దుకు ముందుంటామని పేర్కొన్నారు. ఎలాంటి సమ స్యలున్నా నేరుగా డయల్ 100కు ఫిర్యాదు చేయవచ్చ న్నారు. అసాంఘిక శక్తులకు దూరంగా ఉండాలన్నారు. కొత్త వ్యక్తులకు ఆశ్రయం ఇవ్వవద్దన్నారు. కార్యక్ర మంలో సీఐ స్వామి, ఎస్సై వెంకటేష్, జడ్పీటీసీ పుష్పలత, సర్పంచ్ శారద తదితరులు ఉన్నారు.
Updated Date - 2022-07-04T03:50:16+05:30 IST