పోలీసులు క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి
ABN, First Publish Date - 2022-05-27T04:42:39+05:30
అధికారులతో సమన్వయంగా ఉంటూ క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని ఎస్పీ కె సురేష్కుమార్ అన్నారు. గురువారం ఏఆర్ హెడ్క్వార్టర్లో కౌన్సెలింగ్ ద్వారా జిల్లాలో పనిచేస్తున్న సివిల్ పోలీసువిభాగంలోని ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుళ్లకు కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేపట్టి పోస్టింగులు కేటాయించారు.
ఆసిఫాబాద్, మే 26: అధికారులతో సమన్వయంగా ఉంటూ క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని ఎస్పీ కె సురేష్కుమార్ అన్నారు. గురువారం ఏఆర్ హెడ్క్వార్టర్లో కౌన్సెలింగ్ ద్వారా జిల్లాలో పనిచేస్తున్న సివిల్ పోలీసువిభాగంలోని ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుళ్లకు కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేపట్టి పోస్టింగులు కేటాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలతో సత్సంబంధాలను ఏర్పాటు చేసుకొని శాంతి భద్రతల పరిర క్షణకు పాట ుపడాలన్నారు. నిజాయితీతో పనిచేసి పోలీసు శాఖకు మంచిపేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ఏఆర్ ఏఎస్పీ భీంరావు, ఆర్ఐలు శేఖర్బాబు, శ్రీనివాస్, ప్రతాప్, సిబ్బంది ఇషాక్ఆలీ, చైతన్య తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-05-27T04:42:39+05:30 IST