రాజకీయ లబ్ధి కోసమే ఏలేటి ఆరోపణలు
ABN, First Publish Date - 2022-05-16T04:54:12+05:30
మాజీ ఎమ్మె ల్యే మహేశ్వర్ రెడ్డి అబద్ధాల మనిషి అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేయడం రాజకీయ లబ్ధి కోసమేనని మున్సిపల్ చైర్మన్ జి.ఈశ్వర్ అన్నారు.
మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్
నిర్మల్ అర్బన్, మే 15 : మాజీ ఎమ్మె ల్యే మహేశ్వర్ రెడ్డి అబద్ధాల మనిషి అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేయడం రాజకీయ లబ్ధి కోసమేనని మున్సిపల్ చైర్మన్ జి.ఈశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం నిర్వ హించిన విలేకరుల సమావేశంలో ము న్సిపల్ చైర్మన్, పార్టీ పట్టణ అధ్యక్షుడు మారు గొండ రాము, కౌన్సిలర్ నేరెళ్ల వేణు, తెలంగాణ హజ్ కమిటీ మెంబర్ నజీరుద్దీన్ మాట్లాడుతూ... నిర్మల్ నియోజకవర్గంలో మం త్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేక మహేశ్వర్ రెడ్డి అసత్య ప్ర చారాలు చేయడం, విమర్శించడం సరికా దన్నారు. మళ్లీ మంత్రి ఇలాంటి విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. నిర్మల్ నియోజకవర్గ పట్టణ ప్రజానీకానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేసే అభివృద్ధి తెలుసని, నెలకు ఒక్కసారి వచ్చి ఏదో చేస్తున్నట్లు ఇంకా ఉనికి ఉందని నిరూపించుకోవటానికి మంత్రిని, మంత్రి కుటుంబాన్ని విమర్శించడం సరైన పద్ధతి కాదన్నారు. నియోజకవర్గ ప్రజలు రెండు సార్లు ప్రజా తీర్పు ఇచ్చి మచ్చలేని మని షి, ప్రజా సేవకుడైన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని గెలిపించుకున్నారన్నారు. నిర్మల్ పట్టణంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులు మీ కంటికి కనిపిస్తలేవా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ అయ్యన్న గారి రాజేందర్, మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు సయ్యద్ ముషీర్ ఉద్దీన్ ఉన్నారు.
Updated Date - 2022-05-16T04:54:12+05:30 IST