కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేసేందుకే డిజిటల్ సభ్యత్వ నమోదు: మాణిక్కం ఠాకూర్
ABN, First Publish Date - 2022-02-27T20:52:59+05:30
పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతీ కార్యకర్తకు సమన్యాయం కల్పించడమే పార్టీ ఉద్దేశమని మాణిక్కం ఠాకూర్ అన్నారు.
నిర్మల్: పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతీ కార్యకర్తకు సమన్యాయం కల్పించడమే పార్టీ ఉద్దేశమని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్కం ఠాకూర్ అన్నారు. ఆదివారం ఆయన నిర్మల్లోని పార్లమెంట్ రివ్యూ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేసేందుకే డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చెప్పటం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ గల పార్టీ అని, ఎవరు పనిచేస్తున్నది, ఎవరు పని చేయనిది అధినాయకత్వం గమనిస్తోందన్నారు. సభ్యత్వ నమోదు కోసం పనిచేస్తున్న 24 వేల కార్యకర్తల వివరాలు రాహుల్ గాంధీ వద్ద ఉన్నాయని, రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని మాణిక్కం ఠాకూర్ పిలుపునిచ్చారు.
Updated Date - 2022-02-27T20:52:59+05:30 IST