సింగరేణి పాలిటెక్నిక్ కాలేజ్లో కలుషిత నీరు కలకలం
ABN, First Publish Date - 2022-03-15T15:47:37+05:30
శ్రీరాంపూర్లోని సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో కలుషిత నీరు కలకలం రేపుతోంది.
మంచిర్యాల: శ్రీరాంపూర్లోని సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో కలుషిత నీరు కలకలం రేపుతోంది. కలుషిత నీరు తాగడంతో 40 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కొద్ది రోజులుగా మురికినీరు సరఫరా అవుతున్నా అధికారులు పట్టించుకోని పరిస్థితి నెలకొంది. అవే నీటిని సేవించడంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
Updated Date - 2022-03-15T15:47:37+05:30 IST