ప్రధాని బహిరంగ సభను విజయవంతం చేయండి
ABN, First Publish Date - 2022-06-27T04:19:53+05:30
సికింద్రాబాద్లో జూలై 3న జరిగే ప్రధాని మోదీ బహిరంగసభను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కొత్తపల్లిశ్రీనివాస్ కోరారు.
చింతలమానేపల్లి/బెజ్జూరు/రెబ్బెన, జూన్ 26: సికింద్రాబాద్లో జూలై 3న జరిగే ప్రధాని మోదీ బహిరంగసభను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కొత్తపల్లిశ్రీనివాస్ కోరారు. ఆదివారం ఆయన చింతలమానే పల్లి, బెజ్జూరు, రెబ్బెన మండల కేంద్రాల్లో కార్యకర్తలతో సభకు సంబంధించిన సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ బహిరంగసభను విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతీ కార్యకర్తపై ఉందన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారం చేపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈనెల 30న జాతీయ కార్యదర్శి పంకజ్ ముండే కాగజ్నగర్కు వస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో తాలూకాకన్వీనర్ వీరభ ద్రాచారి, మండలాధ్యక్షుడు శ్రీశైలం, ప్రధానకార్యదర్శి తిరుపతిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. బెజ్జూరులో బీజేపీ నాయకులు తిరుపతి, మురళీగౌడ్, భిక్షపతి, దిగంబర్, రామయ్య, వసీఖాన్, తిరుపతి, సతీష్, వెంకటేష్, నందరాం, శ్రావన్రావు, జనార్దన్ పాల్గొన్నారు. రెబ్బెనలో దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు కుమ్మరి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-06-27T04:19:53+05:30 IST