గ్రామీణ రహదారులకు పెద్దపీట
ABN, First Publish Date - 2022-08-12T04:23:13+05:30
గ్రామీణ రహదారులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోం దని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. తంగళ్లపల్లి నుంచి కన్నెపల్లి మండలంలోని సుర్జాపూర్ వద్ద నల్లవాగుపై స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (యస్డీఎఫ్) నిధులు రూ.3 కోట్లతో నిర్మించే వంతెన పనులను గురువారం ప్రారంభించారు.
భీమిని, అగస్టు 11: గ్రామీణ రహదారులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోం దని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. తంగళ్లపల్లి నుంచి కన్నెపల్లి మండలంలోని సుర్జాపూర్ వద్ద నల్లవాగుపై స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (యస్డీఎఫ్) నిధులు రూ.3 కోట్లతో నిర్మించే వంతెన పనులను గురువారం ప్రారంభించారు. తంగళ్లపల్లి నుంచి చిన్నతిమ్మాపూర్ గ్రామాల మధ్యలో ఎర్రవా గుపై వంతెన నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. భీమిని, దహగాం జెడ్పీ టీసీలు పోతురాజుల గంగక్క, శ్రీమారామరావు, సర్పంచు ఇందూరు భూమయ్య, వైస్ ఎంపీపీ మధు, సర్పంచులు ఎల్లాగౌడ్, సంతోష్, నాయకులు పాల్గొన్నారు.
Updated Date - 2022-08-12T04:23:13+05:30 IST