పర్వతారోహణం చేసిన కాల్వ నరసింహస్వామి
ABN, First Publish Date - 2022-05-20T06:37:29+05:30
కాల్వఅడవుల్లో కొలువైన లక్ష్మీనరసింహస్వామి పర్వతారోహణం గురువారం చేశారు.
దిలావర్పూర్, మే 19 : కాల్వఅడవుల్లో కొలువైన లక్ష్మీనరసింహస్వామి పర్వతారోహణం గురువారం చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిత్యార్చన పూజలతో పాటు హవనము, బలిహరణ పూజలు, పల్లకీసేవలు అందుకున్న స్వామివారు అనంతరం పర్వతారోహణం చేశారు. ఆలయ అనువంశిక య జ్ఞాచార్యులు శ్రీమాన్ చక్రపాణి నరసింహమూర్తి భక్తులకు లక్ష్మీ నరసింహ స్వామివారి దోపు కథ వినిపించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ నిమ్మల చిన్నయ్య, ధర్మకర్తలు గట్టునర్సయ్య, అదుముళ్ల గంగాధర్, ఎస్పీ కిషన్, షేర్చందు, గంగుబాయి, రామ్రెడ్డి, ప్రధాన అర్చకులు రామానుజ రాము, దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ రవికిషన్గౌడ్, ఈవో సదయ్య, జూనియర్ అసిస్టెంట్ మాధవరావు పటేల్, వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు.
Updated Date - 2022-05-20T06:37:29+05:30 IST