పట్టాదారు పాసుపుస్తకాలు ఇప్పించాలి
ABN, First Publish Date - 2022-01-23T03:36:32+05:30
మండలంలోని చిన్న తిమ్మాపూర్ పంచాయతీలోని తంగళ్లపల్లిలో ఉన్న 600 ఎకరాలకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇప్పించాలని తంగళ్లపెల్లి రైతులు శనివారం సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్పను కలిసి వినతి పత్రం అందించారు. 1 నుంచి 50 సర్వే నెం బరులో 300 ఎకరాలు పట్టాభూమి, 300 ఎకరాలు లావాణీ పట్టా భూమి ఉందన్నారు.
భీమిని, జనవరి 22 : మండలంలోని చిన్న తిమ్మాపూర్ పంచాయతీలోని తంగళ్లపల్లిలో ఉన్న 600 ఎకరాలకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇప్పించాలని తంగళ్లపెల్లి రైతులు శనివారం సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్పను కలిసి వినతి పత్రం అందించారు. 1 నుంచి 50 సర్వే నెం బరులో 300 ఎకరాలు పట్టాభూమి, 300 ఎకరాలు లావాణీ పట్టా భూమి ఉందన్నారు. మొత్తం 600 ఎకరాలకు తెలంగాణ ప్రభుత్వం పాసు పుస్తకాలు అందించలేదని ధరణి పోర్టల్లో డిస్పూట్ ల్యాండ్గా చూపిస్తుందన్నారు. ఈ విషయంపై సంబంధిత కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. పట్టాదారు పాసు పుస్తకాలు లేకపోవడంతో ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. సమస్యను పరిష్కరించి తమకు న్యాయం చేయా లని కోరారు. రైతులు ఇందూరి భూమయ్య, అన్నం శ్రీనివాస్, బాలేష్, సందీప్, కిషన్, గుండ య్య, రాజయ్య, మదుకర్ పాల్గొన్నారు.
Updated Date - 2022-01-23T03:36:32+05:30 IST