ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Governor Tamilisai.. నేను ఒక తల్లిగా ఇక్కడికి వచ్చాను..

ABN, First Publish Date - 2022-08-07T17:54:40+05:30

రాష్ట్రంలో ఎక్కడా ప్రోటోకాల్ అమలు కావడం లేదని గవర్నర్ తమిళి సై అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్ (Nirmal): గవర్నర్ తమిళి సై (Governor Tamilisai) ఆదివారం ఉదయం బాసర (Basara) ట్రిపుల్ ఐటీ (Triple IT)కి చేరుకుని క్యాంపస్‌లో కలియతిరిగారు. విద్యా బోధన, వసతి సౌకర్యాలపై ఆరా తీశారు. హాస్టల్ గదులు, వాష్‌ రూంలను పరిశీలించారు. విద్యార్థులు హాస్టల్ సమస్యలతో పాటు అకాడమిక్ సమస్యలను గవర్నర్ దృష్టికి తెచ్చారు. అనంతరం బాసర ట్రిపుల్ ఐటీ వద్ద గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ ప్రోటోకాల్ (Protocol) ఎక్కడా అమలు కావడం లేదన్నారు. తాను ఒక తల్లిగా ఇక్కడికి వచ్చానని తెలిపారు. విద్యార్థుల సమస్యలను  పరిష్కరించాలని వచ్చానని, ఆహారం విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. ట్రిపుల్ ఐటీలో పరిస్థితులు అందరికీ తెలిసినవేనని, సానుకూల దృక్పథంతో  సమస్యలను  పరిష్కరించాలని అధికారులకు సూచించానన్నారు. సెక్యూరిటీ  సమస్యలతో అందరూ ఇబ్బందులు పడుతున్నారని, అధ్యాపకుల భర్తీతో సహా టైమ్ బాండ్ ప్రకారం సమస్యలను  పరిష్కరించాలని, విలువలతో కూడిన విద్య, స్నేహపూర్వక వాతావరణం కలిపించాలని అధికారులకు సూచించినట్లు గవర్నర్ తమిళి సై వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-08-07T17:54:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising