కాగజ్నగర్లో ఘనంగా ఎన్టీఆర్ శత సంవత్సర వేడుకలు
ABN, First Publish Date - 2022-05-29T03:53:07+05:30
ఎన్టీఆర్ శత జయంతీ వేడుకలు శనివారం కాగజ్నగర్లో ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, అభిమా నులు కలిసి ఎన్టీఆర్ చౌరస్తాలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు.
కాగజ్నగర్, మే 28: ఎన్టీఆర్ శత జయంతీ వేడుకలు శనివారం కాగజ్నగర్లో ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, అభిమా నులు కలిసి ఎన్టీఆర్ చౌరస్తాలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ సినీనటుడే కాకుండా రాజకీయాల్లో కూడా అరుదైన ఘనత సాధించిన మహనీయుడన్నారు. కార్యక్ర మంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కాసం శ్రీనివాస్, మున్సిపల్ వైస్చైర్మన్ గిరీష్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
టీడీపీ ఆధ్వర్యంలో
టీడీపీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు గుళ్లపల్లి ఆనంద్ ఆఽధ్వర్యంలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు శని వారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం ఆనంద్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషిచేసిన మహనీయుడు ఎన్టీఆర్ అన్నారు.
Updated Date - 2022-05-29T03:53:07+05:30 IST