ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాతమద్దిపడగలో విద్యుత్‌షాక్‌తో రైతు మృతి

ABN, First Publish Date - 2022-05-25T06:31:00+05:30

కడెం మండలం పాతమద్దిపడగ గ్రామానికి చెందిన పల్లెబుచ్చన్న ( 60) అనే రైతు మంగళవారం విద్యుత్‌ షాక్‌తో మృతి చెందాడు.

బుచ్చన్న మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖానాపూర్‌, మే 24 : కడెం మండలం పాతమద్దిపడగ గ్రామానికి చెందిన పల్లెబుచ్చన్న ( 60) అనే రైతు మంగళవారం విద్యుత్‌ షాక్‌తో మృతి చెందాడు. బుచ్చన్నకు గ్రామశివారులో మూడెకరాల వ్యవసాయభూమి ఉంది. ఇందులో వరితో పాటు పలు రకాల కూరగాయలు సాగుచేశాడు. రోజూలాగే మంగళవారం కూడా తన వ్యవసాయ క్షేత్రంలో ఉన్న కూరగాయలకు నీటిని పారించేందుకు వెళ్లాడు. అయితే బుచ్చన్న పొలంలోకి వెళ్లేసరికి విద్యుత్‌ తీగలు కిందకు వేలాడుతూ కనిపించాయి. దీంతో విద్యుత్‌ తీగలను సరి చేసేందుకు ట్రాన్స్‌ఫార్మర్‌ ఆఫ్‌ చేసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద తెగి పడి ఉన్న విద్యుత్‌ తీగలకు తగిలి బుచ్చన్న అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య చంద్రవ్వ, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాజు తెలిపారు. 

Updated Date - 2022-05-25T06:31:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising