డబుల్ బెడ్రూం ఇండ్లను పారదర్శకంగా కేటాయించాలి
ABN, First Publish Date - 2022-12-06T22:05:17+05:30
డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపును పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. మంగళవారం రాజీ వ్నగర్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావుతో కలిసి సందర్శించారు.
మంచిర్యాల కలెక్టరేట్, డిసెంబరు 6: డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపును పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. మంగళవారం రాజీ వ్నగర్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావుతో కలిసి సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ డబుల్ బెడ్రూం ఇండ్లలో అర్హులను గుర్తించి లాటరీ పద్ధతిన పారదర్శకంగా కేటాయిస్తామన్నారు. మంచి ర్యాల నియోజకవర్గ పరిధిలో 650 ఇండ్లు లక్ష్యం కాగా 30 ఇండ్లను అర్హులకు అందజేశామన్నారు. 330 ఇండ్లను జనవరి 15 నాటికి పూర్తి చేసేందుకు అధికా రులు కృషి చేస్తున్నారన్నారు. అర్హుల ఎంపికలో కేటగిరీల వారీగా అర్హులను గుర్తిస్తామని, ప్రతీ కేటగిరీలో 3 శాతం దివ్యాంగులను ఎంపిక చేస్తామన్నారు. రోడ్లు,భవనాల శాఖ ఈఈ రాము, ఆర్డీవో వేణు, తహసీల్దార్ రాజేశ్వర్, మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, పాల్గొన్నారు.
Updated Date - 2022-12-06T22:05:20+05:30 IST