ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు బాలుర మృతి

ABN, First Publish Date - 2022-10-05T06:30:00+05:30

మండలంలో మంగళవారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు బాలురు మృతిచెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుమ్ముగూడెం, అక్టోబరు 4: మండలంలో మంగళవారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు బాలురు మృతిచెందారు. పైడాకులమడుగు గ్రామంలో దొంగతనంగా నిమ్మకాయలు కోసేందుకు యత్నించినఎనిమిదేళ్ల బాలుడు విద్యుదాఘాతంతో మృతిచెందాడు. తన ఇంట్లో నిమ్మకాయల దొంగతనంగా కోస్తున్నారని ఆగ్రహించిన ఓ వ్యక్తి నిమ్మచెట్టుకు విద్యుత్‌ తీగలను ఏర్పాటు చేశాడు. విషయం తెలియని బాలుడు ఉదయం నిమ్మకాయలు కోసేందుకు ప్రయత్నించి విద్యుదాఘాతానికి లోనై మృతిచెందాడు. గుట్టుచప్పుడు కాకుండా బాలుడి అంత్యక్రియలను సైతం పూర్తి చేసినట్లు సమాచారం. ముల్కనాపల్లి గ్రామానికి చెందిన ఉయికా ఏసుదాసు(8) ఊర్లోని కాల్వకు స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు మునిగి మృతిచెందాడు. బాలుడు స్థానిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. స్నానానికి మొత్తం నలుగురు బాలురు వెళ్లగా, ఏసుదాసు మునిగిపోవడం చూసిన మిగతా ముగ్గురు వెనుదిరిగారు. సంఘటనలపై ఎటువంటి ఫిర్యాదులు అందలేదని ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపారు. 

Updated Date - 2022-10-05T06:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising