Corona: బాసర ట్రిపుల్ ఐటీలో కరోనా కలకలం
ABN, First Publish Date - 2022-08-01T18:13:34+05:30
బాసర ట్రిపుల్ ఐటీ (Triple IT)లో కరోనా కలకలం (Corona) రేగింది.
నిర్మల్ (Nirmal): బాసర ట్రిపుల్ ఐటీ (Triple IT)లో కరోనా కలకలం (Corona) రేగింది. ఆరుగురు విద్యార్థుల (Students)కు కోవిడ్ సోకింది. వారిని ఐసోలేషన్ (Isolation)లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మూడు రోజుల క్రితం ఒక విద్యార్థికి కరోనా వచ్చింది. అది ఇతరులకు వ్యాపించింది. దీంతో అధికారులు పరీక్షలు నిర్వహించారు. ఆరుగురికి కోవిడ్ ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో మిగతా విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. అయితే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు విద్యార్థులకు సూచించారు.
Updated Date - 2022-08-01T18:13:34+05:30 IST