ఆకర్షణీయంగా పట్టణ జంక్షన్లు
ABN, First Publish Date - 2022-12-02T00:50:01+05:30
ఆదిలాబాద్ పట్ట ణ జంక్షన్లు మరికొద్ది రోజుల్లో ఆకర్షణీయంగా మారను న్నాయని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.
ఆదిలాబాద్ టౌన్, డిసెంబరు 1 : ఆదిలాబాద్ పట్ట ణ జంక్షన్లు మరికొద్ది రోజుల్లో ఆకర్షణీయంగా మారను న్నాయని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణం లోని ఎన్టీఆర్ చౌరస్తాలో జరుగుతున్న జంక్షన్ల అభివృ ద్ధి పనులను గురువారం మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ పట్టణంలో తెలంగాణ తల్లి, ఎన్టీఆర్ విగ్రహాలను ఆకర్షణీయంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కొ త్త సంవత్సరంలో కొన్ని జంక్షన్లు అందంగా మారనున్నాయన్నారు. ఆదిలాబాద్పై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లు ప్రత్యేక దృష్టిసారిస్తూ ఎస్డీఎఫ్ నిధులు మంజూరు చేస్తూ పట్టణ అభివృద్ధికి కృషి చేస్తున్నార న్నారు. కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ బండర్ సతీష్, కౌన్సిలర్ లక్ష్మణ్, కమిషనర్ శైలజ, ఏఈ అరుణ్, టీఆర్ఎస్ కార్యకర్త వేణుగోపాల్, అశోక్ పాల్గొన్నారు.
Updated Date - 2022-12-02T00:50:02+05:30 IST