ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మున్సిపల్‌ కమిషనర్‌పై చర్య తీసుకోవాలి

ABN, First Publish Date - 2022-01-29T03:36:35+05:30

చెన్నూరు మున్సిపల్‌ కమిషనర్‌ ఖాజామొహిజోద్దీన్‌ వేధింపుల కారణంగానే జిల్లెల సమత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని, వెంటనే కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని సమత కుటుంబ సభ్యులు శుక్రవారం చెన్నూరు-మంచిర్యాల జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.

రహదారిపై రాస్తారోకో చేస్తున్న సమత కుటుంబ సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నూరు, జనవరి 28 : చెన్నూరు మున్సిపల్‌ కమిషనర్‌ ఖాజామొహిజోద్దీన్‌ వేధింపుల కారణంగానే జిల్లెల సమత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని, వెంటనే కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని సమత కుటుంబ సభ్యులు శుక్రవారం చెన్నూరు-మంచిర్యాల జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకోకు కాంగ్రెస్‌ నాయకులు మద్దతు పలికారు.  కుటుంబ పోషణ కోసం చిరు వ్యాపారం చేసుకుంటూ ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తున్న సమతకు ఉపాధి దెబ్బతీసేలా మడిగను తొలగించడం  సరైంది కాదన్నారు. సమతకు ఏదైనా జరిగితే ఆమె పిల్లల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.  రాస్తారోకోతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోవడంతో ఎస్‌ఐ వెంకటస్వామి సంఘటన స్థలానికి చేరుకుని రాస్తారోకో చేస్తున్న వారిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాంగ్రెస్‌ నాయకులు గజ్జెల అంకాగౌడ్‌, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-29T03:36:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising