టీఆర్ఎస్తోనే చిరకాల కల నెరవేరింది : జోగు రామన్న
ABN, First Publish Date - 2022-01-23T05:45:26+05:30
ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న తాంసి బస్టాండ్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం టీఆర్ఎస్తోనే కల నెరవేరిందని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు.
ఆదిలాబాద్, జనవరి22 (ఆంధ్రజ్యోతి) : ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న తాంసి బస్టాండ్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం టీఆర్ఎస్తోనే కల నెరవేరిందని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి పట్టణంలోని పలు ప్రధాన వీధుల గుండా తాంసి బస్టాండ్ రైల్వే ట్రా క్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేసీఆర్, కేటీఆర్ ఫ్లెక్సీలను క్షీరాభిషేకం చేశారు. ఎమ్మెల్యేను నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్వోబీ నిర్మాణానికి రూ.97కోట్ల 20లక్షలను విడుదల చేస్తూ పరిపాలన అనుమతులతో జీవోను జారీ చేసిందన్నారు. దీంతో దశాబ్ద కాలంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం దక్కుతుందన్నారు. పట్టణ అభివృద్ధి కోసం మరో రూ.50కోట్లను తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో పట్టణ టీఆర్ఎస్ నాయకులు అష్రఫ్, ప్రహ్లాద్, యూనిస్అక్బాని, అజయ్, అశోక్స్వామి తదితరులున్నారు.
Updated Date - 2022-01-23T05:45:26+05:30 IST