జేఎన్టీయూ అధికారులపై చర్యలు తీసుకోవాలి
ABN, First Publish Date - 2022-07-07T09:49:49+05:30
రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల అనుబంధానికి సంబంధించి ఏఐసీటీఈ అనుమతి లేకుండా జేఎన్టీయూ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేయడం పట్ల భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (యూఎ్సఎ్ఫఐ) అభ్యంతరం వ్యక్తం చేసింది.
యూఎస్ఎఫ్ఐ డిమాండ్
హైదరాబాద్, జూలై 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల అనుబంధానికి సంబంధించి ఏఐసీటీఈ అనుమతి లేకుండా జేఎన్టీయూ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేయడం పట్ల భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (యూఎ్సఎ్ఫఐ) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు బుధవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశ్వర్లు, మాదం తిరుపతి ఓ ప్రకటన విడుదల చేశారు. ఇంజనీరింగ్ కాలేజీల గుర్తింపు విషయంలో జేఎన్టీయూ అధికారులు నిబంధనలు ఎందుకు పాటించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ జరిపి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Updated Date - 2022-07-07T09:49:49+05:30 IST