ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైతన్యవంతమైన సమాజ నిర్మాణానికి పుస్తకమే సాధనం: శ్రీనివాస్‌ గౌడ్‌

ABN, First Publish Date - 2022-08-17T10:11:43+05:30

చైతన్యవంతమైన సమాజ నిర్మాణానికి పుస్తకమే ప్రధాన సాధనమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు16(ఆంధ్రజ్యోతి): చైతన్యవంతమైన సమాజ నిర్మాణానికి పుస్తకమే ప్రధాన సాధనమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ, హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ ఆధ్వర్యంలో  ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర భారత వజ్రోత్సవ పుస్తక ప్రదర్శనను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. బాపూజీపై వెలువడిన సుమారు వెయ్యి పుస్తకాలు ప్రదర్శనలో ఉండటం గొప్ప విషయమని అన్నారు. మహాత్ముని ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ పుస్తక ప్రదర్శన ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ నెల 22వరకు సాగే ఈ ప్రదర్శనను పాఠకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్‌, హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ కార్యదర్శి కోయ చంద్రమోహన్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంపీ కే.కేశవరావు కూడా పుస్తక ప్రదర్శనను సందర్శించారు. 

Updated Date - 2022-08-17T10:11:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising