ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తండ్రిని గుర్తుచేసుకుని Purandeshwari భావోద్వేగం

ABN, First Publish Date - 2022-05-28T13:48:37+05:30

స్వర్గీయ నందమూరి తారకరామారావు శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌లో ఎన్టీఆర్ కుమార్తెలు, కుమారులు నివాళులర్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: స్వర్గీయ నందమూరి తారకరామారావు(Nandamuri Tarakaramaravu) శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌(NTR Ghat‌)లో ఆ మహనీయుడి కుమార్తెలు, కుమారులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా తండ్రిని గుర్తుచేసుకుని కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి(Daggubati purandeshwari) భావోద్వేగానికి గురయ్యారు. నందమూరి తారక రామారావు ఒక సంచలనం.. ప్రభంజనమన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే ఏడాది మే 28 వరుకు శతజయంతి ఉత్సవాలు చేయనున్నట్లు తెలిపారు. రెండు రాష్ట్రాల్లో 12 కేంద్రాల్లో శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. శత జయంతి ఉత్సవాలు నిర్వహించటానికి ఒక కమిటీని ఏర్పాటు చేశామని అన్నారు. కమిటీలో బాలకృష్ణ, రాఘవేంద్రరావు, రాజేంద్రప్రసాద్, పరుచూరి వంటి ప్రముఖులు ఉన్నారని చెప్పారు. ఎన్టీఆర్ ఫోటోను వంద రూపాయల నాణెంపై ముద్రణ చేయాలనే ఆలోచనతో ఆర్బీఐతో మాట్లాడుతున్నామని అన్నారు. అన్ని రంగాలలో నిష్ణాతులైన కళాకారులని ఘనంగా సత్కారం చేస్తామని దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. 


Updated Date - 2022-05-28T13:48:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising