అమేజ్ఫిట్ నుంచి రెండు వాచీలు
ABN, First Publish Date - 2022-06-04T08:55:04+05:30
అమేజ్ఫిట్ జీటీఎస్ 2 న్యూవెర్షన్ వాచీలు ఆదివారం నుంచి ఇండియాలో అందుబాటులోకి రానున్నాయి.
అమేజ్ఫిట్ జీటీఎస్ 2 న్యూవెర్షన్ వాచీలు ఆదివారం నుంచి ఇండియాలో అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. మిడ్నైట్ బ్లాక్, పెటల్ పింక్ రంగుల్లో ఇవి లభ్యం కానున్నాయి. రిటైల్ ధర రూ.11,999. కాగా వాచీలను మార్కెట్లోకి విడుదల చేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని రూ.వెయ్యి డిస్కౌంట్ ప్రకటించారు. 1.65 ఇంచీల ఎడ్జ్ టు ఎడ్జ్ కర్వ్డ్ డిస్ప్లే ఉంది. మిడ్నైట్ బ్లాక్, డిజర్ట్ గోల్డ్, అర్బన్ గ్రే రంగుల్లో కేసులు ఉంటాయి. మిడ్నైట్ బ్లాక్, అర్బన్ గ్రే కేసులు ఉన్నవాటికి మిడ్నైట్ బ్లాక్ స్ట్రాప్ ఉంది. డిజర్ట్ గోల్డ్ కేసు ఉన్న వాచీకి పెటల్ పింక్ స్ట్రాప్ ఉంది. 3డి కార్నింగ్ గొరిల్ల గ్లాస్ డిస్ప్లే ఇచ్చారు. డైమండ్ లైక్ కార్బన్, యాంటీ ఫింగర్ప్రింట్ కోటింగ్ డిస్ప్లే టాప్లో ఉంది. బయోట్రాకర్ 2తో హార్ట్మానిటరింగ్, ఎస్పిఒ2 సెన్సర్తో బ్లడ్-ఆక్సిజన్ శాచురేషన్ లెవెల్స్ మానిటరింగ్కు అవకాశం ఉంది. స్లీప్ మానిటరింగ్ కూడా ఇందులో ఉంది. 90 వరకు బిల్ట్ ఇన్ స్పోర్ట్ మోడ్స్కు తోడు పాయ్ హెల్త్ అసెస్మెంట్ సిస్టమ్ కూడా ఉంది. వాటర్ ప్రూఫ్ 5 ఏటీఎం కాగా మూడు జీబీ మేరకు ఇంటర్నల్ స్టోరేజీకి అవకాశం ఇచ్చారు. సింగిల్ చార్జ్తో ఆరు రోజులు వాడుకోవచ్చు.
Updated Date - 2022-06-04T08:55:04+05:30 IST