త్వరలో ఫ్లై ఓవర్ ప్రారంభం
ABN, First Publish Date - 2022-11-22T01:44:47+05:30
ఐటీ కారిడార్లో శిల్ప లే అవుట్ వంతెన నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సోమవారం సందర్శించారు.
శిల్ప లే అవుట్ వంతెనను పరిశీలించిన మేయర్
హైదరాబాద్ సిటీ/ గచ్చిబౌలి, నవంబర్ 21 (ఆంధ్రజ్యోతి): ఐటీ కారిడార్లో శిల్ప లే అవుట్ వంతెన నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సోమవారం సందర్శించారు. ప్రమాదాలు జరగకుండా మలుపుల వద్ద ఏర్పాటుచేసిన బ్యారియర్లు, నిర్ణీత వేగంతో ప్రయాణించేలా రంబుల్ స్ర్టిప్స్ ఏర్పాట్లను పరిశీలించారు. మంత్రితో మాట్లాడి ప్రారంభోత్సవ తేదీ నిర్ణయించనున్నట్టు మేయర్ తెలిపారు. వంతెన అందుబాటులోకి వస్తే విమానాశ్రయానికి సులువైన రాకపోకలకు వీలు కలుగుతుందన్నారు. నాలెడ్జ్ సెంటర్, పరిసర ప్రాంతాల్లో మరింత అభివృద్ధికి అవకాశం ఉంటుందని, హైటెక్ సిటీ, నాలెడ్జ్ సెంటర్, ఫైనాన్షియల్ డిస్ర్టిక్ట్ల మధ్య కనెక్టివిటీ మరింత పెరుగుతుందన్నారు. పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జి, రోడ్ నెంబర్-45 వంతెన, కేబుల్ బ్రిడ్జి, మైండ్ స్పేస్ వంతెన మీదుగా గచ్చిబౌలి సులువుగా చేరుకునే వెసులుబాటు కలుగుతుందన్నారు.
Updated Date - 2022-11-22T01:44:48+05:30 IST