బిజినెస్ మేసేజింగ్ ఫీచర్ బంద్!
ABN, First Publish Date - 2022-06-04T08:53:40+05:30
గూగుల్ మెసేజింగ్ సర్వీస్ ఆర్సీఎ్స(రిచ్ కమ్యూనికేషన్ సర్వీసె్స)కు మన దేశంలో స్వస్తి చెబుతున్నట్టు సమాచారం.
గూగుల్ మెసేజింగ్ సర్వీస్ ఆర్సీఎ్స(రిచ్ కమ్యూనికేషన్ సర్వీసె్స)కు మన దేశంలో స్వస్తి చెబుతున్నట్టు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సంస్థలు ఈ సర్వీ్సను ఉపయోగించుకుంటూ ఉంటాయి. ప్రకటనలు మొదలుకుని ప్రమోషనల్ మెటీరియల్ వరకు అంతటికీ ఈ సర్వీస్ ఉపయోగపడుతోంది. అయితే ఇది మన దేశంలో దుర్వినియోగమవుతోంది. స్పామ్ యూజర్ల కోసం కంపెనీలు ఈ సర్వీ్సను ఉపయోగించుకుంటున్నట్టు నివేదికలు వెలువడ్డాయి. పైపెచ్చు అవి ‘వెరిఫైడ్ బిజనెస్’ లేబుల్ కలిగి ఉండటం గూగుల్కు ఆందోళన కలిగిస్తోంది. సమస్యను గుర్తించిన గూగుల్, ఇండియాలో ఈ సర్వీసును చాలా పరిమితం చేస్తున్నట్టు ప్రకటించింది. అంటే ఈ సర్వీస్ ఇండియాలో ఎంతోకాలం ఇక అందుబాటులో ఉండదని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని పరిమితం చేసినప్పటికీ పరిశ్రమలతో కలిసి పని చేస్తూనే ఉంటామని కూడా గూగుల్ ప్రకటించింది. మొత్తమ్మీద ఈ సమస్య నుంచి గూగుల్ ఎలా బైటకు వస్తుందన్నది వేచి చూడాల్సి ఉంటుంది.
Updated Date - 2022-06-04T08:53:40+05:30 IST