ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిరీస్ ఓటమి తర్వాత కోహ్లీ వ్యాఖ్యలు ఇవీ..

ABN, First Publish Date - 2022-01-15T00:42:28+05:30

మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన చివరిదైన మూడో టెస్టులో భారత జట్టు మరో రోజు మిగిలి ఉండగానే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేప్‌టౌన్: మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన చివరిదైన మూడో టెస్టులో భారత జట్టు మరో రోజు మిగిలి ఉండగానే ఏడు వికెట్ల తేడాతో దారుణ ఓటమి చవిచూసింది. ఈ సిరీస్‌ను గెలిచి చరిత్ర సృష్టిస్తుందనుకున్న భారత జట్టు 1-2 తేడాతో ఓటమి పాలైంది. సెంచూరియన్ టెస్టులో విజయం సాధించిన భారత్ ఆ తర్వాత జొహన్నెస్‌బర్గ్, కేప్‌టౌన్ టెస్టుల్లో వరుస పరాజయాలు చవిచూసింది. 


మ్యాచ్ అనంతరం టీమిండియా సారథి విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. బ్యాటింగ్‌లో తరచూ విఫలమవుతుండడం ఎంతమాత్రమూ మంచిది కాదని, ఆ విషయంపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందని అన్నాడు. దీనిని తాము విశ్లేషించుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు.


మరే సమస్యా లేదని, ఒక్క బ్యాటింగ్ తీరే కలచి వేస్తోందని అన్నాడు. విదేశీ పర్యటనల్లో ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నది ఇదేనని, దీనిని సరిచేసుకున్నప్పుడు తాము విజయం సాధించామని గుర్తు చేశాడు. సరిదిద్దుకోలేని చోట ఓటమి పాలయ్యామని కోహ్లీ వివరించాడు.

Updated Date - 2022-01-15T00:42:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising