తెలుగోడి సత్తా..
ABN, First Publish Date - 2022-01-17T08:36:58+05:30
తెలుగోడి సత్తా..
తెలుగు కుర్రాడు సాత్విక్ సాయిరాజ్ ఇండియా ఓపెన్లో దుమ్మురేపాడు. ముంబై షట్లర్ చిరాగ్ శెట్టితో కలిసి పురుషుల డబుల్స్లో విజేతగా నిలిచాడు. అమలాపురానికి చెందిన సాత్విక్, చిరాగ్ జంట .. మూడుసార్లు ప్రపంచ చాంపియన్ జోడీ మహ్మద్ అహ్సాన్-హెండ్రా సెతియావాన్కు షాకిచ్చి టైటిల్ అందుకుంది. తుదిపోరులో సాత్విక్-చిరాగ్ ద్వయం 21-16, 26-24తో ఇండోనేసియాకు చెందిన ప్రపంచ రెండో ర్యాంక్ జోడీ మహ్మద్-హెండ్రాను ఓడించింది. ఇండియా ఓపెన్ గెలవడం సాత్విక్ జోడీకి ఇదే మొదటిసారి. 2019లో థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 టైటిల్ గెలిచిన సాత్విక్ ద్వయం.. అదే ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 టోర్నీలో విజేతగా నిలిచింది.
Updated Date - 2022-01-17T08:36:58+05:30 IST