IPl2022 : పంజాబ్ కింగ్స్ లక్ష్యం 158..
ABN, First Publish Date - 2022-05-23T03:00:09+05:30
ఐపీఎల్ 2022 లీగ్ దశలో చివరిది, నామమాత్రమే అయిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్కు సన్రైజర్స్ హైదరాబాద్ ఓ మోస్తరు లక్ష్యాన్ని నిర్దేశించింది.
ముంబై : ఐపీఎల్ 2022 లీగ్ దశలో చివరిది, నామమాత్రమే అయిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్కు సన్రైజర్స్ హైదరాబాద్ ఓ మోస్తరు లక్ష్యాన్ని నిర్దేశించింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 157 పరుగులు చేసింది. సమష్టిగా రాణించినా వ్యక్తిగతంగా ఎవరూ భారీ స్కోర్లు చేయలేకపోయారు. దీంతో జట్టు భారీ స్కోరును నమోదు చేయలేకపోయింది. సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్మెన్ల వ్యక్తిగత స్కోర్లు ఈ విధంగా ఉన్నాయి. ప్రియం గార్గ్(4), అభిషేక్ శర్మ(43), రాహుల్ త్రిపాఠి(20), ఐడెన్ మార్క్క్రమ్(21), నికోలస్ పూరన్(5), రొమరియో షెఫర్డ్ (26 నాటౌట్), జగదీశ సుచిత్(0), భువనేశ్వర్ కుమార్(1), ఉమ్రాన్ మాలిక్(1, నాటౌట్)గా ఉన్నారు.
ఇక పంజాబ్ కింగ్స్ బౌలర్లలో కగిసో రబడా 1 వికెట్, నాథన్ ఇల్లీస్, హర్పీత్ బ్రార్ చెరో 3 చొప్పున వికెట్లు తీశారు. ఒక రనౌట్ ఉంది. 12 ఎక్స్ట్రాలు వచ్చాయి.
Updated Date - 2022-05-23T03:00:09+05:30 IST