ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇండియా ఓపెన్‌లో కరోనా కలకలం

ABN, First Publish Date - 2022-01-14T09:18:09+05:30

ఇండియా ఓపెన్‌లో కరోనా కలకలం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాంత్‌ సహా ఏడుగురు షట్లర్లకు పాజిటివ్‌


న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్‌లో ఆడుతున్న ప్రపంచ మాజీ నెంబర్‌ వన్‌ కిడాంబి శ్రీకాంత్‌ సహా ఏడుగురు భారత షట్లర్లకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్దారణ అయింది. శ్రీకాంత్‌తో పాటు అశ్విని పొన్నప్ప, రితికా రాహుల్‌, ట్రీసా జాలీ, మిథున్‌ మంజునాథ్‌, సిమ్రాన్‌ అమన్‌ సింగీ, ఖుషీ గుప్తాకు పాజిటివ్‌గా తేలారు. వీరిలో పొన్నప్ప, రాహుల్‌, ట్రీసా, సిమ్రన్‌ డబుల్స్‌ షట్లర్లు కావడంతో వారి భాగస్వాములు కూడా టోర్నీ నుంచి తప్పుకొన్నట్టు భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) తెలిపింది. 


డబుల్స్‌ క్రీడాకారిణిపై విమర్శలు: ఈ టోర్నీలో ఆడుతున్న హైదరాబాద్‌కు చెందిన ఒక యువ డబుల్స్‌ క్రీడాకారిణి భాగస్వామి వల్లే ఇంతమంది వైరస్‌ బారిన పడ్డారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈనెల 8న హైదరాబాద్‌లో సదరు క్రీడాకారిణికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్‌గా తేలింది. అయినా సరే ఆమె టోర్నీలో ఆడేందుకు ఢిల్లీ రావడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. హైదరాబాద్‌లో ఆ అమ్మాయి సాధన చేసే ఒక ప్రముఖ అకాడమీలోనే పలువురు స్టార్‌ ప్లేయర్లు కూడా టోర్నీ ప్రారంభానికి ముందు ప్రాక్టీస్‌ చేశారని తెలుస్తోంది. కొవిడ్‌ పాజిటివ్‌ అని తెలిసినా ఆమె టోర్నీలో ఆడడానికి రావడం, ఈ విషయం బాయ్‌ ప్రధాన కార్యదర్శి అజయ్‌ సింఘానియాకు తెలియజేసినా ఆయన పట్టించుకోలేదని పలువురు షట్లర్ల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 

Updated Date - 2022-01-14T09:18:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising