మూడో వన్డేలో పోరాడి ఓడిన భారత్... వన్డే సిరీస్ దక్షిణాఫ్రికా కైవసం
ABN, First Publish Date - 2022-01-24T04:06:10+05:30
కేప్టౌన్: దక్షిణాఫ్రికా నిర్దేశించిన 288 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 49.2 ఓవర్లలో 283 పరుగులకు ఆలౌటైంది.
కేప్టౌన్: దక్షిణాఫ్రికా నిర్దేశించిన 288 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 49.2 ఓవర్లలో 283 పరుగులకు ఆలౌటైంది. దీంతో దక్షిణాఫ్రికా 4 పరుగుల తేడాతో గెలిచినట్లైంది. మూడు వన్డేల సిరీస్ను సఫారీలు 3-0తో గెలుచుకున్నారు. భారత బ్యాట్స్మెన్లో కోహ్లీ 65, ధావన్ 61, దీపక్ చాహర్ 54, సూర్యకుమార్ 39, శ్రేయస్ అయ్యర్ 26 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగిడి, ఆండిల్ మూడేసి వికెట్లు పడగొట్టారు.
అంతకు ముందు దక్షిణాఫ్రికా నిర్ణీత 49.5 ఓవర్లలో 287 పరుగులకు ఆలౌటైంది. డికాక్ 124 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో ప్రసిధ్ 3, చాహర్, బుమ్రా రెండేసి వికెట్లు తీశారు.
Updated Date - 2022-01-24T04:06:10+05:30 IST